Kalyan Ram Speech At Bimbisara Pre Release Event: కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో నిరాశపరిచిన నందమూరి కళ్యాణ్ రామ్.. ఈసారి మాత్రం ‘బింబిసార’తో ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయనని నమ్మకంగా చెప్పాడు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తర్వాత 100కి రెండు వందల శాతం మీరు తప్పకుండా శాటిస్ఫై అవుతారని అభిమానుల్ని ఉద్దేశించి అన్నాడు. ఈ సినిమా ప్రతీ నందమూరి అభిమానిని గర్వపడేలా చేస్తుందని.. తమ కుటుంబానికి మూల కారకుడైన తాత ఎన్టీఆర్కు ‘బింబిసార’ను అంకితం చేస్తున్నానని తెలిపాడు.
‘‘మనందరికీ చందమామ కథలు, అమరచిత్ర కథలతో పాటు జానపద సినిమాలంటే ఎంతో ఇష్టం. పాతాళ భైరవితో మొట్టమొదటగా ఆ జోనర్ సినిమాల్ని తాత మొదటలుపెట్టారు. ఆ తర్వాత బాబాయ్ ‘భైరవద్వీపం’, చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలు చేశారు. వీటితో పాటు ఆ జోనర్లో మరెన్న చిత్రాలు మన ముందుకొచ్చాయి. అదే కోణంలో ఒక జానపద, సోషియో ఫాంటసీ సినిమా తీసుకురావాలని మేము చేసిన ప్రయత్నమే ఈ బింబిసార. ఆగస్టు 5వ తేదీన వస్తోన్న ఈ సినిమాను థియేటర్లకు వెళ్లి చూడండి. కచ్ఛితంగా ఇది అలరిస్తుంది. ఏ ఒక్కరినీ నిరాశపరచదు. 200 శాతం శాటిస్ఫై అవుతారు’’ అని కళ్యాణ్ రామ్ ప్రసంగించాడు. తప్పకుండా ఇది ఈ సినిమా నచ్చి తీరుతుందని కాన్ఫిడెన్స్ని వ్యక్తపరిచాడు.
అనంతరం.. ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు కళ్యాణ్ రామ్ పేరుపేరున ధన్యవాదాలు తెలిపాడు. ఈ చిత్రం కోసం ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, వారి వల్లే ‘బింబిసార’ ఇంత అద్భుతంగా వచ్చిందన్నాడు. ఈ సినిమాకి ప్రాణం పోసింది మాత్రం కీరవాణినేని అన్నాడు. ఇక తనకు ఇంత పెద్ద సినిమా ఇచ్చిన నిర్మాత హరిబాబుకి తాను జీవితాంతం రుణపడి ఉంటానంటూ.. కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.