టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ‘కార్తీకేయ-2’. గతంలో వచ్చిన కార్తీకేయ మూవీకి ఈ సినిమా సీక్వెల్గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తొలి ట్రైలర్ను చిత్రయూనిట్ హైదరాబాద్ నగరంలోని ఏఎంబీ థియేటర్లో విడుదల చేసింది. ఈ సినిమాను కూడా తొలిభాగానికి దర్శకత్వం వహించిన చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు అయితే ఈ మూవీ ట్రైలర్ చూస్తే మనకు దేవీపుత్రుడు సినిమా గుర్తుకురావడం ఖాయం
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దేవీపుత్రుడు సినిమాలో కృష్ణుడు, సముద్రం, అయోధ్య అనే అంశాలు కనిపిస్తాయి. ఇప్పుడు కార్తీకేయ-2 సినిమాలో కూడా కృష్ణుడు చుట్టూ అల్లుకున్న అంశం కనిపిస్తోంది. కృష్ణుడి విగ్రహం, దాని వెనుక ఉన్న శక్తి, ఆ శక్తి కోసం పరితపించే విలన్స్… ఇలా దేవీపుత్రుడు, కార్తీకేయ-2 సినిమాకు పోలికలు కనిపిస్తున్నాయి. మరి కథనం ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 22న విడుదల కానుంది. అదే రోజు నాగచైతన్య నటించిన థ్యాంక్యూ సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర మంచి పోటీ ఉండనుంది.
The time is now, get ready to enter the world of #Karthikeya2! 🔥
Watch the trailer launch LIVE 👉 https://t.co/qr9YfJjGWi@actor_Nikhil @anupamahere @AnupamPKher@Actorysr @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 @peoplemediafcy pic.twitter.com/E2n8WUpcZy
— Telugu FilmNagar (@telugufilmnagar) June 24, 2022