బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన కొత్త సినిమా గణపథ్. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ‘ఏ హీరో ఈజ్ బార్న్’ అనే ట్యాగ్లైన్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ప్రసిద్ధ పూజ ఎంటర్టైన్మెంట్, గుడ్ కోతో కలిసి వికాస్ బహ్ల్ దర్శకత్వంలో దేనికి రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రాన్ని వశు భగ్నాని, జాకీ భాగ్నని, దీప్శిక దేష్ముఖ్, వికాస్ బహ్ల్ కలిసి నిర్మించారు. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 20న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదలకు గణపథ్ సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గణపథ్ ట్రైలర్ను మంగళవారం నాడు మేకర్స్ విడుదల చేశారు. టైగర్ ష్రాఫ్ వీరోచిత పోరాటాలతో, కృతి సనన్ డాషింగ్ ఫైట్లతో, అమితాబ్ అద్భుత స్క్రీన్ ప్రెజెన్స్తో కొత్త లోకాన్ని గణపథ్ ట్రైలర్ పరిచయం చేసింది. పూజ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే దూసుకుపోతున్న భారతీయ చిత్ర పరిశ్రమలో మరో సంచలనానికి నాంది పలికింది. కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గణపథ్ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
వినూత్నమైన యాక్షన్తో కూడిన గణపథ్ ట్రైలర్ చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఒక యాక్షన్ విందు అందివ్వనుంది. స్టన్నింగ్ విజువల్స్, ఉత్కంఠ రేపే పోరాట సన్నివేశాలతో పాటు, భారీ కాస్టింగ్ ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఒక పెయింటింగ్ లాంటి నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లింది. భవిష్యత్ను వరల్డ్ క్లాస్ వీఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన లోకంలో తీసుకెళ్లడానికి ఖర్చుకి నిర్మాతలు వెనుకాడలేదు. నిర్మాత జాకీ భగ్నని సినిమాలో క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు. ఈ సందర్భంగా నిర్మాత జాకీ భజ్ఞని మాట్లాడుతూ.. గణపథ్ ట్రైలర్కు, ఫస్ట్ సాంగ్కు వస్తున్న ఈ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే పడ్డ కష్టం అంతా మర్చిపోయి, ప్రేక్షకుల అంచనాలు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 20న విడుదల కానున్న సినిమా ను కూడా ఇలాగే ఆదరిస్తారని, నమ్మకంగా ఉందన్నారు. గణపథ్ ట్రైలర్ను చూసిన ప్రేక్షకులు టైగర్ ష్రాఫ్ ఫైట్స్, కృతి సనన్ చేసిన స్టన్నింగ్ యాక్షన్ సూపర్బ్ అని కామెంట్ చేస్తున్నారు.