కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. 17 మంది దుర్మరణం

0
167

దేశ ఆర్థిక రాజధానిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం సోమవారం రాత్రి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 23 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఘటనాస్థలిని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాల యజమానులకు గతంలోనే నోటీసులు అందించామని, వాటిని సీరియస్‌గా తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సర్కారు రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. ఈ విషాద ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్ దేశాయ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here