కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఈడీకి లేఖరాశారు.. కోవిడ్ బారిన పడడం.. కోలుకున్న తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందిపడిన ఆమె.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నా.. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మలీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఆమె హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈడీకి లేఖరాసిన ఆమె.. విచారణను ప్రస్తుతం వాయిదా వేయాలని అభ్యర్థించారు.. రేపటి విచారణకు హాజరుకాలేనని తెలిపిన సోనియాగాంధీ, తన ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు కొన్ని వారాలపాటు నేషనల్ హెరాల్డ్కు సబంధించిన మనీ లాండరింగ్ కేసులో హాజరుకావడాన్ని వాయిదా వేయాలని కోరారు.
అయితే, సోనియాగాంధీ జూన్ 2వ తేదీన కోవిడ్ బారినపడ్డారు.. ఆ తర్వాత కోలుకున్నా.. కోవిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు.. వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమెను రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు వైద్యులు.. అయితే, కరోనా చికిత్స కారణంగా.. ఈడీ ముందుకు రాలేకపోయిన ఆమె.. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి మరింత సమయం కోరారు.. జూన్ 8న ఆమె ఏజెన్సీ ముందు హాజరు కావాల్సి ఉన్నా.. సమయం కావాలంటూ ఆమె చేసిన అభ్యర్థనకు ఏజెన్సీ అంగీకరించింది. ప్రస్తుతం ఆమె విశ్రాంతిలో ఉన్న కారణంగా మరికొంత సమయం అడుగుతున్నారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే..