తోపుడు బండి వ్యాపారికి ఇద్దరు బాడీగార్డులు.. ఇంతకీ విషయం ఏంటంటే?

0
106

ఉత్తర్‌ప్రదేశ్‌లో తోపుడు బండిపై వస్త్రాలు విక్రయించే ఓ వ్యక్తికి ఇద్దరు బాడీగార్డులు తుపాకులతో రక్షణ కల్పిస్తున్నారు. ఆయన దుస్తులు విక్రయిస్తుండగా బాడీగార్డులు తుపాకులతో రక్షణ కల్పిస్తున్నారు. ఇందకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజుకు కొద్దిమొత్తంలో సంపాదించే ఆ తోపుడు బండి యజమానికి బాడీగార్డుల రక్షణ వెనక పెద్ద కథే ఉంది. యూపీలోని ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్‌ దయాల్‌ తోపుడు బండిపై బట్టల వ్యాపారం చేస్తుంటారు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌ సింగ్‌ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. కులం పేరుతో జుగేంద్ర తనను దూషించారని రామేశ్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జుగేంద్ర హైకోర్టుకు వెళ్లారు.

నీట్‌ వివాదం.. ఐదుగురు అరెస్ట్..!

దీంతో తనను కులం పేరుతో దూషించారంటూ జుగేంద్ర, లేఖపాల్ రాంఖిలాడి, రామమూర్తి, రేఖలపై రామేశ్వర్ దయాళ్ ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జుగేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. రామేశ్వర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, కేసును కొట్టివేయాలని కోరారు. దీంతో కోర్టుకు హాజరుకావాల్సిందిగా రామేశ్వర్ దయాళ్‌ను కోర్టు ఆదేశించింది. శనివారం ఆయన కోర్టుకు ఒంటరిగా రావడాన్ని గమనించిన కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయనకు రక్షణ ఎందుకు కల్పించలేదని పోలీసులను ప్రశ్నించింది. వెంటనే ఇద్దరు బాడీగార్డులను నియమించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు రామేశ్వర్‌కు ఇద్దరు గార్డులను నియమించారు. వారిద్దరూ ఏకే 47 రైఫిళ్లతో ఆయనకు రక్షణగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 25న జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here