ఏపీలోని తాజా పరిస్థితులను కేంద్ర పెద్దలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ వివరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు అగ్రనేతల అపాయింట్మెంట్స్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్కళ్యాణ్ ప్రచారంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంపై కేంద్ర పెద్దలతో భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తిరుపతి లోక్సభ స్థానానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికపై బీజేపీ అగ్రనేతలతో పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ- జనసేన కూటమి అభ్యర్థిని ప్రకటించే విషయంపై ఈ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. ఇక ఇటీవల అమరావతి రైతులను కలిసిన సేనాని వారికి అన్ని రకాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై కూడా పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు కూడా ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక మంతనాలు జరిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.