గ్రేటర్ హైదరాబాద్ లో భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. కూకట్పల్లిలో భూప్రకంపనలు సంభవించాయి.. స్థానిక అస్బెస్టాస్ కాలనీలో ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో భూమి కంపించిది. రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో భూమిలోపల నుంచి భారీ శబ్ధాలు వచ్చాయంటున్నారు.. ఊహించని పరిణామంతో షాక్తిన్న స్థానికులు.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఇంతకముందు భారీ వర్షాలు కురిసిన సమయంలో కూడా హైదరాబాద్ లో భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి.. బోరబండ ప్రాంతంలో ప్రజలను కొన్ని రోజుల పాటు వణికించాయి.