మెగా కుమారుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా ముకుంద సినిమాతోనే తన మార్క చూపించుకున్న వరుణ్ తేజ్. అగ్ర హీరో విక్టరీ వెంకటేష్తో కలిసి చేస్తున్న సినిమా ఎఫ్3. ఈ సినిమా సూర్ హిట్ అయిన ఎఫ్2కు సీక్వెల్గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు కథను లాక్డౌన్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపుడి సిద్దం చేశాడు. ఎఫ్2ను డైరెక్ట్ చేసిన అనిల్ ఎఫ్3ని కూడా డైరెక్ట్ చేయనున్నారు. దాదాపు ఎఫ్2కు పనిచేసిన వారే మరోసారి జతకట్టి ఎఫ్3ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు అనిల్. ఈ సినిమాను కుదిరినంత త్వరగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రీకరణను శరవేగంతో పూర్తి చేస్తున్నామని, చివరికీ వారంతాల్లో కూడా సెలవులే తీసుకోకుండా చేస్తున్నామన్నాడు. అంతేకాకుండా ఫన్కి సెలవులు ఉందవంటూ ఎఫ్3 సెట్స్ నుంచి ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో హీరో వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపుడి, నిర్మాత దిల్ రాజు, సునీల్ కలిసిన కూర్చుని ఉన్నారు. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చాలా కొత్త తరహాలో ఉండబోతుందని, దీనిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.