ఆసీస్ పర్యటనలో ఆకట్టుకున్న సిరాజ్ ఈరోజు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తన తండ్రి సమాధిని దర్శించుకున్నాడు. అనంతరం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీమ్ ఇండియా విజయంలో నా పాత్ర వుండడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. నా అట తీరుపై అలాగే గెలుపు ఓటముల పై వుప్పొంగి పోనన్న ఆయన ఇండియాలో అడుగుపెట్టగానే తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించానని అన్నారు. టెస్ట్ మ్యాచ్ అడడం ద్వారా నా తండ్రి కోరిక నెరవేర్చాను. చారిత్రాత్మక విజయంలో నా తండ్రి లేకపోవడం ఎంత గానో బాధిస్తోంది.. రానున్న ఇంగ్లాండ్ టూర్ లో మంచి ప్రతిభ కనుబరుచుట, అదే జోష్ తో టీమ్ ఇండియా అద్బుతం చేస్తుంది. ఆస్ట్రేలియా టూర్లో తొలి వికెట్ తీయడం మర్చిపోలేనిది, ఆస్ట్రేలియా సిరీస్ లో తీసిన ప్రతి వికెట్ నా తండ్రికి అంకితం చేస్తున్నా. క్రికెట్ లో అవినీతి కి చోటు లేదు ప్రతిభ ఉంటే ఎవరైనా రాణించగలరు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇంటికి వచ్చినప్పుడు తల్లిని ఓదార్చడం కష్టంగా మారిండి. హైదరాబాద్ రంజీ ట్రోఫీ ఆడే సమయంలో కెప్టెన్గా వ్యవహరించిన హనుమాన్ విహారి సలహాలు ఎంతగానో దోహదపడ్డాయి. విరాట్ కోహ్లీ , అజింక్య రహానే కెప్టెన్సీ అద్భుతం.. టీమిండియా సభ్యులు బూమ్రా పుజారా నటరాజ్ వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ బుజం తట్టారు.. టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సలహాలు, సూచనలు బౌలింగ్ లోనూ ఫీల్డింగ్ అద్భుత ప్రదర్శన కనపరిచే చేశాయి. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియన్లు తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధించింది అని అన్నారు.