ఇండియాలో నిన్న 10 వేలకు దిగువగా నమోదైన కరోనా కేసులు ఈరోజు పెరిగాయి. అయితే ఇప్పటికే ఇండియాలో కోటి ఐదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇండియాలో 12,689 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో.. 13,320 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,89,527 కు చేరింది. ఇందులో 1,03,59,305 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,76,498 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 137 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,53,724 కు చేరింది అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.