భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 83 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 9,695 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,05,850 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,50,055 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,06,99,410 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,56,385 నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 1,11,16,854 కు చేరింది.