దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. గడచిన 24 గంటలలో 10,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 78 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 13,255 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,16,434 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,47,306 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,07,12,665 కి చేరింది. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,56,463 నమోదైంది. ఇటు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 1,17,45,552 కు చేరింది.