సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కట్టడిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్, ట్విట్టర్ అకౌంట్ను ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మీడియా, సోషల్ మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని.. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందన్నారు సీఎం జగన్. నిజమేంటో, అబద్ధం ఏంటో చూపిస్తారని..దురుద్దేశపూర్వక ప్రచారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదని... ప్రజలను తప్పు దోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని... ఇలాంటి వాటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలని తెలిపారు.