పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్ధంమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగుల విషయపై మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులతో చర్చలు జరపడానికిమ మేం సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే ఓ నాలుగు మెట్లు దిగడానికైనా సిద్ధమని తెలిపారు. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సజ్జల తెలిపారు. రేపటి నుంచి ప్రతిరోజు 12 గంటలకు అందుబాటులో ఉంటామన్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలేవరూ వచ్చిన చర్చలకు సిద్ధమేనని వెల్లడించారు. చర్చలకు కూర్చోకుండా షరతులు పెట్టడం సమంజసం కాదన్నారు.
ఈ విధంగా వ్యవహరించడం సరికాదని సజ్జల అభిప్రాయపడ్డారు. బాధ్యత కలిగిన నేతలు ఇమ్మెచ్యూర్ గా వ్యహరించడం సరికాదన్నారు. ఉద్యోగులు మా ప్రత్యర్థులో.. శత్రువులో కాదు.. ప్రభుత్వంలో భాగమేనని స్పష్టం చేశారు. అగ్నికి ఆజ్యం పోసే అంశాలపై మేం మాట్లాడమన్నారు. పే స్లిప్పులు వస్తే ఎంత పెరిగిందో.. ఎవరికి తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందన్నారు.సీఎం జగన్ పాజిటీవ్గా ఉండే వ్యక్తి చర్చలకు వెళ్లాల్సిందిగా నేతలకు ఉద్యోగులూ చెప్పాలన్నారు. ఉద్యోగుల లేఖ ఇచ్చిన రోజే ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని చెప్పాం.. కానీ చర్చలకు వారే రాలేదన్నారు. సమ్మె చట్ట విరుద్ధమని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పిందన్నారు.