ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా రజనీకాంత్ చేసిన ప్రసంగంపై వైసీపీ నేతలు, మంత్రులు ఒక స్థాయిలో ధ్వజమెత్తారు. తీవ్రంగా విమర్శలు చేశారు. వైసీపీ నేతల తీరు, రజనీకాంత్ పై వైసీపీ నేతల విమర్శలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. రజనీకాంత్ పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి. జగన్ ప్రభుత్వం పై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలు చేస్తోంది.
అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం.సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి.వైసీపీ ప్రభుత్వ పోకడలపై రజనీ చిన్న విమర్శ చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదు.వివిధ అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు.అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు.శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే.నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి.జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలన్నారు చంద్రబాబు.