ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ల ఏర్పాటుపై సీఎస్ రివ్యూ

0
91

రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ల ఏర్పాటుపై సాధించిన పురోగతిని పరిశ్రమల శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష చేశారు. ఆహార, వ్యవసాయ రంగంలో ప్రతి జిల్లాలో డిమాండ్, సాధ్యాసాధ్యాల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లను ఏర్పాటు చేయాలన్నది గౌరవనీయ ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనమని అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేసారు.

దీని ప్రకారం, పెట్టుబడిదారుల నుండి డిమాండ్ ఉన్న ఏడు ప్రదేశాలలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లను ప్రోత్సహించడానికి వ్యూహాన్ని రూపొందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వచ్చే నాలుగైదు నెలల్లోగా రైస్‌మిల్లుల ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌ లో ఆక్వా హబ్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సి.ఎస్ అధికారులను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here