తాజావార్తలు

thumb

మహిళలు గుడికి వెళ్ళేది అందాలు ఆరబోతకే !

October 11,2018 03:59 PM

కేరళ సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఆలయాలకు వెళ్లేది భక్తితో కాదని, అంగాంగ ప్రదర్శనతో అక్కడున్న పురుషులను ఆకట్టుకోవడానికే వారు ఆలయానికి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను అలా చూసి ఆనందించడానికే పురుషులు కూడా ఆలయానికి వెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు.

thumb

జగ్గారెడ్డిని ఎలా టార్చర్ పెట్టారంటే..!

October 01,2018 04:03 PM

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ కూటమి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముందు కేసీఆర్ తన అధికార బలంతో జగ్గారెడ్డిని జైల్లో పెట్టించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నిది కాసేపు పక్కనబెడితే... అవకాశం దొరికిందే తడవుగా టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి అనుయాయులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

thumb

పరిటాల వారసుడి ఎంట్రీ...అక్కడి నుండే !

September 20,2018 06:26 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిటాల కుటుంబం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పరిటాల శ్రీరాములయ్య మొదలుకుని పరిటాల హరీంద్ర, రవీంద్ర ఇలా వారి ప్రస్థానం సాగింది. అయితే రవీంద్ర మంత్రమే రాజకీయాల్లో అడుగుపెట్టి అనతికాలంలోనే రాష్ట్ర నాయకుడి స్థాయికి ఎదిగారు. ఆ తరువాత కొన్ని వ్యక్తిగత కక్షల రీత్యా ఆయన హత్య చేయబడ్డారు. రవి హత్య తర్వాత అనూహ్యంగా తమ వారి కోసం సునీత ముందుకు వచ్చి రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించింది.

thumb

అదే జ‌రిగితే సైరాకి బ్రేక్ ప‌డిన‌ట్లే?

September 15,2018 05:45 PM

ప్ర‌చార క‌మిటీలో చిరుకు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని అనుకుంటున్నారుట‌. పార్టీ నాయ‌కుల సూచ‌న మేర‌కే రాహుల్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిసింది. కర్ణాట‌క ఎన్నిక‌ల స‌మయంలోనే చిరును దింపాల‌ని చూసారు. కానీ చిరు సైరా షూటింగ్ లో బిజీగా ఉండ‌టంతో వీలు పడ‌ద‌ని రిక్వెస్ట్ చేయ‌డంతో రాహుల్ లైట్ తీసుకున్నారుట‌. కానీ ఈసారి జ‌రిగే ఎన్నిక‌లు తెలుగు రాష్ర్టానికి సంబంధించిన‌వి కావ‌డంతో చిరు ను ఒప్పించి బ‌రిలోకి దించాల‌ని చూస్తున్నారుట‌.

thumb

జగన్ కు షాక్ ఇచ్చిన సునీల్ !

September 12,2018 10:46 AM

వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే చాలామంది నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరుతుండగా జగన్ కు తాజాగా కాకినాడ వైసీపీలో కీలక నేతగా పేరున్న చెలమలశెట్టి సునీల్ షాకిచ్చారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం అయ్యిందని తెలుస్తోంది. ఈ వార్తలకు ఊతం ఇస్తూ నిన్న సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సునీల్ కలిశారు.

thumb

జగన్ ను కలిసిన క్లాస్ మేట్స్....జగన్ రికార్డ్ !

September 09,2018 10:48 AM

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తల పెట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతుంది. వైఎస్ జగన్ నిన్న విశాఖ నగరంలో అడుగుపెట్టారు. నిన్న పెందుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరం నుంచి జగన్ 257వ రోజు(నిన్నటి) పాదయాత్రను ప్రారంభించారు. జెర్రిపోతులపాలెం, పెదనరవ మీదుగా కోటనరవకు చేరుకున్న జగన్ అక్కడ భోజన విరామం తీసుకున్నారు. తిరిగి యాత్రను ప్రారంభించిన జగన్ కొత్తపాలెం మీదగా గోపాలపట్నం వరకు పాదయాత్ర చేసి విశాఖ నగర పరిధిలో అడుగుపెట్టారు.

thumb

బీజేపీలోకి మోహన్ లాల్...?

September 04,2018 05:32 PM

మాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ బీజేపీలో చేరనున్నట్లు దేశవ్యాప్తంగా ఊహాగానాలు చెలరేగాయి. అందుకనే నిన్న సోమవారం కృష్ణాష్టమి రోజున ప్రధాని నరేంద్రమోడీతో డైరెక్ట్ గా మోహన్‌లాల్‌ సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోహన్ లాల్ విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రధానికి వివరించినట్లు సమాచారం అందుతుందిగానీ..

thumb

'ప్రగతి నివేదన సభ' ఉంటుందా.?. ఉండదా .?

August 30,2018 09:00 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ఒక పక్క శరవేగంగా సాగుతుంటే.. మరోపక్క ఆ సభపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ న్యాయవాది హైకోర్ట్ కెక్కాడు. కొంగరకలాన్ వేదికగా నాలుగు సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపేలా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ నిర్వహిస్తున్నారు.

thumb

మళ్ళీ గవర్నర్ తో కేసీఆర్ భేటీ ... అందుకేనా ?

August 28,2018 09:03 PM

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్ గవర్నర్‌తో సమావేశమయ్యారు. అయితే గవర్నర్‌తో కేసీఆర్ భేటీ వింతేమీ కాకపోయినా రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు ఊహాగానాల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

thumb

చిలకలూరిపేటలో రజనీ శపధం నెరవేరేనా ?

August 26,2018 11:50 AM

ఆయా తర్వాత ఏకంగా పుల్లారావు సీట్ అడిగి అధిష్టానంతో లేదనిపించుకున్నారు. అక్కడితో ఆగక ఢిల్లీ సాథయిలో లాబీయింగ్ లు చేయడం వలన ఆమెకు ప్ర‌త్తిపాటి పుల్లారావుతో ఏర్ప‌డిన విబేధాలు ఆమె టీడీపీని వీడి వెళ్లేంత వరకు తీసుకు వెళ్లాయి. ఆమె అక్కడితో ఆగకుండా పుల్లారావుని ఓడించి తీరుతానంటూ శ‌ప‌థం చేయడం అప్పట్లో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఆ తరువాత సైలెంట్ అయినా ఆమె బీసీ సంఘాన్ని బలపరుచుకునే పనిలో పడింది.

Twitter