టెక్నాలజీ రోజు రోజుకూ పెరిగిపోతుంటే.. మరో వైపు మోసగాళ్లు సైతం పెరిగిపోతున్నారు. అయితే.. ఫిషింగ్ మెయిల్స్, లింక్లు పంపి ప్రజల వ్యక్తిగత సమాచారన్ని తస్కరిస్తున్నారు. అయితే కొంతమంది తెలియకుండానే ఈ ఫిషింగ్ లింక్ల బారిన పడుతున్నారు. అయితే అందులో ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్ ను సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రజల వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్ల ఎక్కువగా టార్గెట్ చేసే బ్రాండ్గా కొనసాగుతోంది. ఈ మేరకు మంగళవారం ఒక నివేదిక చూపించింది. రెండవ త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 45 శాతం ఫిషింగ్ ప్రయత్నాలతో లింక్డ్ఇన్ అగ్రస్థానంలో ఉండగా, చెక్ పాయింట్ ప్రకారం, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ మొత్తం ఫిషింగ్ ప్రయత్నాలలో 13 శాతంతో రెండవ స్థానానికి చేరుకుంది. డీహెచ్ఎల్ని 12 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉన్న తాజాగా నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. అడిడాస్, అడోబ్ మరియు హెచ్ఎస్బీసీలతో పాటు టాప్ 10 జాబితాలో ఉన్న ఇతర బ్రాండ్లు అమెజాన్ (9 శాతం), ఆపిల్ (3 శాతం), గూగుల్ (1 శాతం) నెట్ఫ్లిక్స్ (1 శాతం), మరియు అడోబ్ (1 శాతం) ఉన్నాయి. అయితే ఈ ప్లాట్ఫాంలను వేదికగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఈ సంస్థల నుంచి మెయిల్స్, లింక్ పంపినట్లు ఫిషింగ్ చేస్తున్నారు.
చెక్ పాయింట్ సాఫ్ట్వేర్లోని డేటా రీసెర్చ్ గ్రూప్ మేనేజర్ ఒమర్ డెంబిన్స్కీ మాట్లాడుతూ.. “ఫిషింగ్ ఇమెయిల్లు ప్రతి హ్యాకర్ ఆర్సెనల్లో ఒక ప్రముఖ సాధనం. ఎందుకంటే అవి వేగంగా అమర్చడం మరియు సాపేక్షంగా తక్కువ ఖర్చుతో మిలియన్ల మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకోగలవు.” వారు సైబర్ నేరస్థులకు విశ్వసనీయ బ్రాండ్ల ఖ్యాతిని ప్రభావితం చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఇది వినియోగదారులకు తప్పుడు భద్రతా భావాన్ని అందించడం ద్వారా ఆర్థిక లాభం కోసం వ్యక్తిగత లేదా వాణిజ్య సమాచారాన్ని దొంగిలించడానికి ఉపయోగించుకోవచ్చు” అని డెంబిన్స్కీ వెల్లడించారు.