ఆ ఇంటి కాకి మా మీద వాలితే చంపేస్తాం: రేవంత్ రెడ్డి

0
192

భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని లంచ్ బ్రేక్‌లో కలుసుకున్న తర్వాత టీఆర్ఎస్‌తో పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌తో పొత్తు అనేది కలలో కూడా జరగదని.. పొత్తు కాదు కదా, కనీసం ఆ ఇంటి కాకి తమ ఇంటిపై వాలదని చెప్పారు. ఒకవేళ వాలితే మాత్రం చంపేస్తామని హెచ్చరించారు. వరంగల్ సభలోనే టీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాపాలను, తప్పులను మోసేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగా లేదని.. ఆయనతో పొత్తు లేదని తేల్చి చెప్పారు. పొలిటికల్ సీన్‌లో కాంగ్రెస్‌ను లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ బీజేపీని ఎంకరేజ్ చేశారని, ఇప్పుడు అదే బీజేపీ కేసీఆర్ పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు.

ఇక రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. కర్ణాటక, రాయచూర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ మూడో వారంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అవుతుందని రేవంత్ తెలిపారు. దేశంలో ఎవ్వరు ఆహ్వానించనట్టుగా.. రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ స్వాగతం పలుకుతుందని అన్నారు. తెలంగాణలో బీజేపీలో గెలిచేంత మొనగాళ్లు ఎవరున్నారని ప్రశ్నించిన ఆయన.. ఆ పార్టీలో పట్టుమని పది మంది కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో ఇటు తెలంగాణలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. తెలంగాణలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here