యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. అయితే మొన్నటి వరకు భారీగా నమోదైన కరోనా కేసులు ఇప్పడిప్పుడే మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 33,455 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 528 మందికి కరోనా సోకినట్లు నిర్థాణైంది. అత్యధికంగా హైదరాబాదులో 196 కొత్త కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33, నల్గొండ జిల్లాలో 32, రంగారెడ్డి జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి.
అయితే.. అదే సమయంలో 771 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,26,284 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,16,506 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 5,667 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది కరోనాతో మరణించారు.