ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేసి.. నీతులు వల్లిస్తున్నారు- కిషన్ రెడ్డి

0
109

ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేసి.. నీతులు వల్లిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. అప్పులు చేయక పోతే జీతాలు ఇవ్వని పరిస్థితి… భూములు అమ్మక పోతే పూట గడవని పరిస్థితి నెలకొందని తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం వేరే ఇతర ఏ పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ గురించి ఎక్కువగా నేను మాట్లాడను, కేటీఆర్ ఇంత దిగజరుతారని అనుకోలేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. న్యాయ బద్ధమైన గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు. తెలంగాణకు కేంద్రం అవార్డులు ఇస్తే హర్షం వ్యక్తం చేస్తారన్నారు. లోపాలు చెబితే పక్షపాతం అంటారా? అని ప్రశ్నించారు. కేంద్రం పక్షపాతం వహిస్తే అవార్డులు ఎలా వస్తాయని మండిపడ్డారు. కేసీఆర్ లాగా మేము స్వార్ధ పరులం కాదు.. భయపడము అంటూ కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ అంటే కేసీఆర్ కి గౌరవం లేదని అన్నారు. అసెంబ్లీ రెండు రోజులు నడిపి సరిపెడతారా ?అంటూ ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ని ఎందుకు అసెంబ్లీలో ఉండనివ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేసి.. నీతులు వల్లిస్తున్నారు అని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ భద్రత అవసరం లేదని అన్నారు. మా భద్రత మేము చూసుకుంటామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here