మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కిషర్‌ రెడ్డి సీరియస్.. ఏ అధికారం ఉందంటూ ఆగ్రహం

0
68

Kishan Reddy: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వెల్లి మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాడం ఏంటని, మీకు ఏ అధికారం ఉందంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై మండిపడ్డారు. మీరు మహిళా రిజర్వేషన్‌ పై ఢిల్లీలో వచ్చి ఆందోళన చేస్తున్న కేసీఆర్‌ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఏ రకమైన అధికారం ఉందని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలో వున్న ఐదు సంవత్సరాల పాటు మీ మంత్రి వర్గంలో ఒక్క మహిళా కూడా లేని ప్రభుత్వాన్ని ఎలగబెట్టిన మీరు ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పోరాడటం ఏంటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ధర్నా చేయాలంటే.. ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద కాదు సీఎం కేసీఆర్‌ కుటుంబం మీద, కేసీఆర్‌ నివాసం ముందు, సీఎం కార్యాలయం ముందు, తెలంగాణ ప్రభుత్వం ముందు నిరసన దీక్ష చేయాలి కానీ ఢిల్లీలో కాదని సంచలన వ్యాక్యలు చేశారు. బీజేపీలో అత్యధికంగా మహిళా ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌ సభ్యులు ఉన్న పార్టీ అని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటి సారి అత్యధికంగా మంత్రులు ప్రాతి నిత్యం వహిస్తున్నటు వంటి ప్రభుత్వం మాదని కొనియాడారు. మహిళలంటే మాకు గౌరవమని, మీలాగా మహిళా ద్వేషి కలిగినటువంటి పార్టీ కాదని స్పష్టం చేశారు. ఈరోజు సీఎం కుటుంబంపై వచ్చినటు వంటి అనేక రకాల అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించడం కోసం నాటకమే తప్పా మరేంకాదని కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు గుప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here