ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల కౌంటర్ వేశారు. గ్రూప్-1 పరీక్షలు రాయొద్దని, ప్రత్యేక తెలంగాణలో రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు KCR కాదా? తొమ్మిదేండ్లుగా ఒక్క గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని దద్దమ్మ KCR కాదా?
కొలువులు ఇవ్వకుండా వందలాది మంది నిరుద్యోగుల ఉసురుతీసిన ఘనత KCRది కాదా?ఆత్మహత్య చేసుకున్న ఒక్క కుటుంబాన్నైనా పరామర్శించారా?ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి అని యువతను వంచించింది KCR కాదా ?
బిస్వాల్ కమిటీ లక్షా 91వేల ఖాళీలు ఉన్నాయన్నది వాస్తవం కాదా?దేశంలో ఎంప్లాయ్ మెంట్ పాలసీ తీసుకురావాలంటున్న చిన్నదొర KTR,రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పండి.TSPSC ప్రశ్నాపత్రాలకు డిజిటల్ సెక్యూరిటీ కల్పించకపోవడం ఐటీ మంత్రిగా మీ వైఫల్యం కాదా?
యువతను బలిపశువులను చేసింది KCR ఐతే,అదే యువత ఉద్యోగ ఆకాంక్షలను పాతరేసింది KTR.మీకు సిగ్గుంటే ముక్కునేలకు రాసి,యువతకు క్షమాపణ చెప్పి, లక్షా 91వేల ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చి,నిరుద్యోగ భృతి అమలు చేయండి అంటూ ట్వీట్ చేశారు షర్మిల.