రీ రిలీజ్‌లోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘అవతార్’

0
1029

13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ మూవీకి సీక్వెల్ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అవతార్-2 ది వే ఆఫ్ వాటర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అవతార్ ఫస్ట్ పార్టును శుక్రవారం (సెప్టెంబర్ 23) విడుదల చేశారు. జేమ్స్ కామోరూన్ తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. 237 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ 2.8 బిలియన్ డాలర్లు వసూలు చేసి కలెక్షన్లలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అవతార్ కొనసాగుతోంది.

అయితే రీ రిలీజ్‌లోనూ భారీ కలెక్షన్లు సాధించడం అవతార్ సత్తాకు నిదర్శనం. ఒక్క భారత్‌లోనే అడ్వాన్స్ బుకింగ్ ల రూపంలోనే ఈ చిత్రానికి కోటి రూపాయలు వసూలు చేసింది. వీకెండ్ నాటికి దేశంలో రూ.5 కోట్లు వసూలు చేసే అవకాశలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఫ్రాన్స్, కొరియా, సౌదీ అరేబియా, బెల్జియం, ఫిలిప్పీన్స్ దేశాల్లోనూ అవతార్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇటీవల వచ్చిన బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షా బంధన్, లాల్ సింగ్ చద్దా వంటి బాలీవుడ్ సినిమాల కన్నా అవతార్ సినిమాకు ఎక్కువగా అడ్వాన్స్ టికెట్లు బుక్ అవ్వడం విశేషం. కాగా ఈ సినిమాలో శామ్ వర్దింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్ నటించారు. అవతార్ తదుపరి భాగాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here