భారత ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు.. పాట్నాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు బీహార్ పోలీసులు.. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారు.. అందులో భాగంగా.. ఈ నెల 12వ తేదీన ప్రధాని మోడీ.. బీహార్ పర్యటనను లక్ష్యంగా చేసుకున్నారని.. ప్రధాని హత్యకు కుట్రపన్నారని జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ జల్లావుద్దీన్, అథర్ పర్వేజ్గా పోలీసులు తెలిపారు.. అరెస్టైన వారికి పీఎఫ్ఐతో లింకులు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు.. అరెస్టైన వారిని అథర్ పర్వేజ్, ఎండీ జలాలుద్దీన్గా తేల్చారు.. ప్రధాని మోడీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్లో శిక్షణ పొందారు.. జులై 6, 7 తేదీల్లో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకునేందుకు వ్యూహాత్మకంగా సమావేశాలు నిర్వహించినట్టు గుర్తించారు.
ఇక, అనుమానిత ఉగ్రవాదుల ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో, పోలీసులు నేరారోపణ పత్రాలను కనుగొన్నారు, వాటిలో ఒకటి — ‘2047 ఇండియా టువర్డ్స్ రూల్ ఆఫ్ ఇస్లామిక్ ఇండియా’ ఉంది.. వారి నుంచి 25 పీఎఫ్ఐ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద మాడ్యూల్ పనిచేస్తున్నట్లు సమాచారం అందింది, ఆ తర్వాత పోలీసులు మరియు కేంద్ర సంస్థలు జూలై 11న అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి తీవ్రవాద కుట్రలో శిక్షణ తీసుకునేందుకు యువకులు ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారని దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు.. అరెస్టయిన వీరిద్దరూ భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి డబ్బును పొందేవారని పోలీసులు వెల్లడించారు.