షాకింగ్.. ఈత కొడుతున్న బాలుడిని మింగేసిన మొసలి

0
563

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. షియోపూర్‌లోని చంబల్ న‌దిలో ఈత కొడుతున్న బాలుడిని మొస‌లి మింగేసింది. దీంతో ఒడ్డున ఉన్న స్థానికులు భయభ్రాంతులకు గురై ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు చేరవేశారు. వెంట‌నే వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని కర్రలు, తాడు, వల సహాయంతో మొసలిని పట్టుకున్నారు. వారు నది నుంచి మొసలిని బయటకు తీసుకువ‌చ్చారు. మొసలి కడుపులో బాలుడు ఉన్నాడ‌ని చెప్పారు. పదేళ్ల బాలుడు సజీవంగానే ఉండటంతో మొసలిని చంపేందుకు స్థానికులు ప్రయత్నించారు.

అయితే ఈ సమాచారం తెలుసుకుని ఎలిగేటర్ విభాగ బృందం, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల బారి నుంచి మొసలిని రక్షించేందుకు ప్రయత్నించాయి. దీంతో అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బాలుడి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. మొసలి బిడ్డను బయటకు పంపినప్పుడే వదిలేస్తామని వాళ్లు స్పష్టం చేశారు. కానీ మొస‌లి తినేస్తే బాలుడు బ‌తికి ఉండే అవ‌కాశం లేద‌ని, దానిని క‌డుపును చీల్చడం వ‌ల్ల ప్రయోజ‌నం లేద‌ని అధికారులు గ్రామ‌స్తుల‌కు చెప్పారు. దీంతో కొన్ని గంట‌ల త‌ర్వాత గ్రామ‌స్తులు శాంతించి ఆ మొస‌లిని త‌మ ప్రాంతానికి దూరంగా వ‌దిలేయాల‌ని చెప్పారు. అనంతరం అధికారులు ఆ మొస‌లిని విడిచిపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here