గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 31న ఫ్రాడ్ అనలిటిక్స్ ఫోరెన్సిక్ అకౌంటింగ్’పై ఒకరోజు ఆన్లైన్డ్ వర్క్షాపు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి న (ఐఎస్ఓసీ)తో కలిసి దీనిని నిర్వహిస్తున్నట్టు అకౌంటింగ్ విభాగాధిపతి డాక్టర్ గుత్తి ఆర్.కె.ప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. తాజా మోసపు పోకడలు, ఫోరెన్సిక్ అకౌంటింగ్ పద్ధతులపై ఈ వర్క్షాప్ లోతైన అవగాహనను కల్పిస్తుందని ఇందులో పాల్గొనేవారికి, వారు పనిచేసే సంస్థలను రక్షించడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందిస్తుందన్నారు. సంస్థలలో మోసానికి గల కారణాలు – పర్యవసానాలను అర్థం చేసుకోవడం; మోసం తాజా పోకడలు, ఆ వాతావరణాన్ని పసిగట్టడం, ఫోరెన్సిక్ అకౌంటింగ్ పద్ధతులను నేర్చుకోవడం; మోసాన్ని గుర్తించి, అర్థం చేసుకోవడానికి ఫోరెన్సిక్ అకౌంటింగ్ను ఎలా వినియోగించాలి వంటి అంశాలపై అవగాహన ఏర్పరచడం ఈ కార్యశాల లక్ష్యంగా డాక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు.
యూజీ, సీజీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, అధ్యాసకులు, కార్పొరేట్లో పనిచేసే ఎగ్జిక్యూటీవ్లు, అకౌంటింగ్ ప్రొఫెషనల్స్- ప్రాక్టీషనర్లు డెరెక్ట్ టు డివెస్ట్ పద్ధతిలో జరిగే ఈ కార్యశాలలో పాల్గొనవచ్చన్నారు. అమెరికాలోని డెలాయిట్ ఫోరెన్సిక్ మేనేజర్ అస్ అగర్వాల్: భారత చార్టర్డ్ అకౌంట్స్ ఇన్స్టిట్యూట్ క్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ సతీష్ లడ్డా: ఢిల్లీలోని క్రైస్ట్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ అభిషేక్ మహేశ్వరి. సాఫ్ట్వేర్ కన్సల్టెంట్-డేటా అనలిస్ట్ జ్యోతి రంజన్ నాయర్లు ఈ కార్యశాలలో ప్రధాన ప్రకలుగా పాల్గొంటారని ఆయన ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్ల నమోదు, రుసుము తదితర వివరాల కోసం డాక్టర్ బి.రమేష్ (98496 25037) డాక్టర్ చంద్రభాను దాస్ (99380 78219)లను సంప్రదించాలని, లేదా rbishett@gitamedu, cdasi@gilam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.