పెళ్లి జరిగిన మరుసటి రోజే వరుడు మృతిచెందాడు.. పెళ్లి జరిగిన మరుసటి రోజే.. కొత్త దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు.. ఉత్సాహంగా పడక గదిలోకి వెళ్లిన ఆ యువకుడు.. కాసేపటికే కన్నుమూశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని మదనపల్లెలో పెళ్లి జరిగి 12 గంటలు గడవక ముందే వరుడు మృతిచెందాడు.. చంద్రాకాలనీలో తులసిప్రసాద్కు శిరీష అనే యువతితో సోమవారం ఉదయం వివాహం జరిగింది… ఇక, మంగళవారం రాత్రి పెళ్లి కూతురు ఇంటి దగ్గర శోభనానికి ఏర్పాట్లు చేసినట్టు చేశారు.. అయితే, శోభనం రోజు రాత్రి పడకగదిలోనే వరుడు తులసిప్రసాద్ మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది..
తులసిప్రసాద్ గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఉన్నట్టుండి పడకగదిలో వరుడు అచేతనంగా పడిపోవడంతో.. ఆందోళనకు గురైన వధువు.. కుటుంబ సభ్యులకు తెలిపింది.. వారు వెంటనే వరుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు విడిచినట్టు చెబుతున్నారు.. మృతిచెందిన వరుడు తులసిప్రసాద్ స్వగ్రామం పాకాల మండలం కట్టకిందపల్లి.. దీంతో, మదనపల్లి నుంచి వరుడు మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తరలించారు కుటుంబ సభ్యులు.. అయితే, పెళ్లి జరిగిన ఒక్కరోజులోనే వరుడు మృతిచెందడం.. విషాదంగా మారింది.. కాగా, వధూవరులిద్దరూ గతంలో ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు.. కానీ, తొలిరాత్రే ఆ యువకుడికి చివరి రాత్రిగా మిగిలిపోయింది.