తెలంగాణకే పరిమితం కాకుండా దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్నారు కేసీఆర్.. విజయదశమి రోజు టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ తీర్మానం చేశారు.. ఇవాళ బీఆర్ఎస్ నేతలు.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పుపై ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అందజేయనున్నారు.. అయితే, రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్పై చర్చ సాగుతోన్న సమయంలో… కేసీఆర్ కేబినెట్లో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారాయి..
Read Also: సూర్యుడిపై భారీ పేలుడు.. భూమిపై ప్రభావం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. విజయదశమిని పురస్కరించుకుని.. వివిధ ప్రాంతాల్లో దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు.. రావణ దహనం చేశారు.. ఒక వేదికపై ఆయన మాట్లాడుతూ.. నోరు జారారు.. టీఆర్ఎస్ పెట్టి తెలంగాణ సాధించారు.. సీఎం కేసీఆర్, కేటీఆర్.. ఇప్పుడు భారతీయ… అని మధ్యలో ఆపి.. ఏ పార్టీ పెట్టారని అక్కడి ప్రజలను ప్రశ్నించారు.. ఓ యువకుడు బీఎస్పీ.. మరో యువకుడి నుంచి బీఆర్ఎస్ అనే సమాధానాలు వినిపించాయి.. కానీ, మంత్రి మళ్లీ మాట్లాడుతూ.. కేసీఆర్ పెట్టింది బీఎస్సీ.. శుభదినం రోజు కేసీఆర్ బీఎస్పీ ప్రకటించారు.. జాతీయ రాజకీయాల్లో రాణిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. మొత్తంగా.. టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీగా మారితే.. మంత్రి ఎర్రబెల్లి మాత్రం.. బీఎస్పీ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.. సీఎం ప్రకటించిన పార్టీ పేరు కూడా తెలియదా? అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు..