జల వనరుల ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌కు లోకేష్ బహిరంగ లేఖ

0
520

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి లేఖ రాశారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏఏ ప్రాజెక్టులను ఎప్పుడు ప్రారంభిస్తామో మంత్రి చెప్పి 34 నెలలు అయిందని.. ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు. తమ ఐదేళ్ల పాలనలో 68,293 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టుల పనులు చేపట్టామని లోకేష్ వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీమ ఎత్తిపోతలకు పథకం పేరుతో జల జగడం సృష్టించి జగన్ వేడుక చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని ఆస్తులు, కేసుల నుంచి రక్షణ కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణమని.. టీడీపీ హయాంలో ఏడాదికి రూ 13,600 కోట్లు ప్రాజెక్టులపై ఖర్చు చేస్తే..వైసీపీకి రూ.5, 844 కోట్లు వెచ్చించి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్లను మార్చి కమిషన్లు దండుకుంటోందని లోకేష్ ఆరోపించారు. వంశధార, మహేంద్ర తనయ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని.. వెలిగొండను అనుమతులు లేని ప్రాజెక్టుగా గెజిటులో పేర్కొన్నా.. కేంద్రాన్ని ప్రశ్నించలేని దయనీయ స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారన్నారు. జగన్ ప్రభుత్వ తీరుతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని.. కమిషన్లు దండుకోవడం ఆపి, నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని లేఖలో నారా లోకేష్ డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here