స్థానిక సంస్థల నిధులు వెంటనే విడుదలచేయాలి..వైబీ రాజేంద్రప్రసాద్

0
911

ఏపీలో స్థానిక సంస్థల నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ మండిపడుతోంది. 4 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ రిపోర్ట్ ను వెంటనే ఆమోదించి అమలు చేయాలని ఛాంబర్ అధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ ఆలస్యం వలన గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ విమర్శించారు.

73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలలోని ఆర్టికల్ 243 లో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 5 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం స్థానిక ప్రభుత్వాలయిన గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్ లకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రాష్ట్రప్రభుత్వం ఇవ్వవలసిన వాటా నిధులను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 4 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ నివేదికను శాసనసభ, శాసన మండలి ముందు ఉంచి వెంటనే ఆమోదించి దానిని అమలు పరిచి దాని ప్రకారం మా స్థానిక ప్రభుత్వాలకు వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ 4, 5 వ రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాటులో, అమలులో రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తున్న జాప్యం వలన మా స్థానిక ప్రభుత్వాలు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ను అమలు చేయకపోవడం, నియమించ కపోవడం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం లోని ఆర్టికల్ 243 కు వ్యతిరేకం. ఇది రాజ్యాంగ విరుద్ధం. మా స్థానిక ప్రభుత్వాలకు నిధులు ఎగ్గొట్టడం కోసమే కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా దురుద్దేశంతో రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫార్సులను అమలు చేయడం లేదు.

గత 3 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇవ్వవలసిన 2019 నుంచి 2022 వరకు సుమారు రూ,, 4000 కోట్ల రూపాయలను మా గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్ లకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎగకోట్టింది. వెంటనే ఆ 4 సంవత్సరాలకు చెందిన సుమారు రూ,, 4000 వేల కోట్లు మా స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు రాజేంద్ర ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేసి, అమలు చేయకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం 15 వ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను 2021- 22 సం,, లకు చెందిన రెండో క్వార్టర్ నిధులు 969 కోట్లు మరియు 2022- 23 సం,, లకు చెందిన రూ,, 2020 కోట్ల నిధులను మా స్థానిక సంస్థలకు విడుదల చేయకుండా ఆపి వేసినది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం ను ఏర్పాటు చేసి అమలు చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లో చలనం లేకపోవడం సిగ్గుచేటైన విషయం అని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here