బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండలు సిద్ధం అవుతున్నాయి. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ను కలిసిన తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏ వీ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి. స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేసిన టీటీడీ ఛైర్మన్, ఈవోలు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం వైయస్.జగన్కు ఆహ్వాన పత్రం అందజేసిన టీటీడీ ఛైర్మన్, ఈవోలు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5 వ తేదీవరకు జరగనున్న శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లుచేశారు.