బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభమైన సంగతి అందరికి సుపరిచతమే.. షో ప్రారంభమై 2 రోజులు కాలేదు అప్పుడే బిగ్ బాస్ ఇంట్లో సందడి మొదలయింది.. ఈ సందడిని రెట్టింపు చేస్తూ బిగ్ బాస్ హౌస్లోకి నవీన్ పోలిశెట్టి గెస్ట్ గా వెళ్లారు.. ఊరికే రారు మహానుభావులు అని.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం ప్రమోషయిన్స్ లో బిజీగా ఉన్న నవీన్ బిగ్ బాస్ ని కూడా వదలలేదు..
డార్క్ రూమ్ లోకి ప్రవేశించి కాసేఫు కంటెస్టెంట్స్ ని ఆటపట్టించాడు నవీన్. అనంతరం శోభా శెట్టి నేను శెట్టి అంటూ పోలిశెట్టితో పరిచయం చేసుకుంది. దీనితో నవీన్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. దీని బట్టి చూస్తే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ కి బిగ్ బాస్ ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది..
బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరో శివాజీ, నాగార్జున ఇచ్చిన 35 లక్షల బంపర్ ఆఫర్ ని మిస్ చేసుకున్న అంటూ సరదా కామెంట్స్ చేసి బిగ్ బాస్ హౌస్ లో జరిగిన మొదటి రోజుని గుర్తు చేసుకున్నారు.. ఇక అమర్ దీప్ కి, ప్రియాంక జైన్ కి మధ్య గొడవలు పెట్టాలి అనే టాస్క్ రితికకి ఇచ్చింది బిగ్ బాస్.. ఈ టాస్క్ ని పూర్తి చేయడానికి నానా తంటాలుపడుతుంది రితిక..
అనంతరం తేజ షకీలాని మీరు అవకాశాలు లేక అడల్ట్ సినిమాలు చేశారా లేక కావాలనే ఇష్టంతోనే ఆ తరహా చిత్రాలు చేశారా ? ఆ పాత్రలు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించేది ? మీ కుటుంబ సభ్యులు ఏమి అనలేదా అని ప్రశ్నించాడు.. ఈ ప్రశ్నలకు ధీటుగా జవాబు ఇచ్చారు షకీలా..
ఏంట్రా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా అంటూ షకీలా స్వీట్ వార్నింగ్ ఇస్తూనే.. నాకు ఆ తరహా పాత్రలు వచ్చాయి కాబట్టే చేశాను.. గ్లామర్ సాంగ్స్ చేస్తే లేని తప్పులేనప్పుడు గ్లామర్ రోల్స్ చేస్తే తప్పేంటి అని షకీలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.. అనంతరం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ మొదలు పెట్టింది.. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్తారో అనేది ఆసక్తిగా మారింది..