గవర్నర్ తమిళిపై వాస్తవాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. గవర్నర్ వ్యవస్థను టీఆర్ఎస్ కించపరుస్తోందని ఆరోపించారు. ఆమెపై బీజేపీ ముద్ర వేసి అవమానిస్తున్నారని చెప్పారు. కల్వకుంట్ల రాజ్యాంగం బ్యాచ్ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేమని మండిపడ్డారు మంచి పడ్డారు. టీఆర్ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించడం గానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించడం గానీ చేయడం లేదని మండిపడ్డారు.
కల్వకుంట్ల రాజ్యాంగ ప్రతిపాదకుల నుంచి ఇంకా ఏం ఆశించగలం? అని ఎద్దేవ చేశారు. గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ భారత రాజ్యాంగం యొక్క ఆదర్శాలను అమలు చేయాలని, గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించాలని, ప్రోటోకాల్లకు కట్టుబడి ఉండాలని అడుగుతున్నారని అన్నారు. గవర్నర్ తమిళసై వాస్తవాలను మాట్లాడారని బండి సంజయ్ అన్నారు. కానీ టీఆర్ఎస్ గవర్నర్ను బీజేపీ వ్యక్తిగా ముద్రవేసి, టీఎస్ ప్రథమ పౌరుడిని అవమానిస్తోంది. అవమానమని ట్విటర్ వేదికగా మండిపడ్డారు బండిసంజయ్.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>TRS sheeple neither respect women nor follow Babasaheb Ambedkar's constitution. What else can we expect from the proponents of Kalvakuntla constitution? Hon'ble Telangana Governor is asking to implement ideals of Indian constitution,respect governor's office & adhere to protocols</p>— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) <a href=”https://twitter.com/bandisanjay_bjp/status/1568106840709558275?ref_src=twsrc%5Etfw”>September 9, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
నిన్న రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్గా మూడేళ్ల పదవీ కాలాన్ని ముగించుకున్న నేపథ్యంలో గురువారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రులు గవర్నర్పై మండిపడ్డారు.