అక్రమ మైనింగ్పై వైసీపీ నేతలు నిసిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ పై సిగ్గు పడాల్సింది పోయి. నిర్లజ్జగా సమర్దించుకుంటూ మసి పూసి మారేడికాయ చేస్తున్నారు.మూడేళ్ల వైసీపీ బకాసురుల చేతిలో రాష్ట్రంలోని కొండలు, గుట్టలు అన్నీ కరిగిపోతున్నాయి.వైసీపీ మూడేళ్లల్లో చేసిన అభివృద్ది శూన్యం.వైసీపీ ఎజెండా కేవలం దాచుకో.. దోచుకో అనే విధంగా ఉంది.175 నియోజకవర్గాలు ఉంటే.. 150 నియోజకవర్గాల్లో యధేచ్చగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు దోచుకుంటున్నారు.హైకోర్టు చరిత్రాత్మక కొండలను కాపాడుకోవాలని చెప్పినా.. అధికారులు కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చి తప్పు దోవ పట్టిస్తున్నారని ఆపంద్ బాబు విమర్శించారు.
వైసీపీ సర్కార్ వల్ల చరిత్రాత్మక విశాఖపట్నం రిషికొండ కనుమరుగైపోయింది.కోర్టులన్నా, ఎన్జీటీలన్నా వైసీపీ సర్కార్కు లెక్కలేదు.మన్యం ప్రాంతంలో వైవీ సుబ్బారెడ్డి బాక్సైట్ ద్వారా 15 నుంచి 20 వేల కోట్ల కుంభకోణానికి తెర తీశారు.అక్రమ మైనింగుపై టీడీపీ నిజనిర్దారణ కమిటీ వెళ్లి పరిశీలిస్తే మాపై కేసులు నమోదు చేస్తున్నారు.టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ. 1000కు వస్తే.. ఇప్పుడు దాన్ని రూ. 7 వేలు చేశారు. దీని వల్ల ఇసుక కొనలేక జనం అవస్థలు పడుతున్నారు.
ఇసుక అందుబాటులో లేక 30 లక్షల కుటుంబాలు అర్దాకలితో అలమటిస్తున్నారు.ఇసుక మొత్తం జగనే తినేస్తున్నాడు.ఇసుక తిన్న జగనుకు.. అది ఎలా అరుగుతుందో అర్ధం కావడం లేదు..?శేఖర్రెడ్డి అనే బినామిని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఇసుక రీచులన్నీ అతనికి కట్టబెట్టారు.పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నాయకత్వంలో కుప్పంలో కొండలు , గుట్టలు అక్రమంగా తవ్వేశారు.పెద్దిరెడ్డి నియోజకవర్గమే కాకుండా, చిత్తూరు జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో అడ్డూ అదుపు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో గత కొంత కాలంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతున్నారు.ప్రకాశం జిల్లాలో గ్రానేట్ వ్యాపారాన్ని గంపగుత్తగా వైసీపీ నేతలు లాగేసుకొని వేబిల్స్ లేకుండా రాష్ట్రాలకు రాష్ట్రాలు తరలిస్తున్నారు.కోట్లాది రూపాయల మైనింగ్ డబ్బంతా సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్కు వస్తుంది.రాష్ట్రంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు.భవిష్యత్తులో దీని కష్టాలు ప్రజలు అనుభవిస్తారు.